పత్తి
ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పాదక మరియు ఎగుమతి దేశాలలో భారతదేశం ఒకటి.
ముఖ్యమైన వాణిజ్య పంట అయిన పత్తిని, ఖరీఫ్ సీజన్లో సుమారు 11 నుండి 12 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తారు.
పత్తి పంట లక్షలాది మంది రైతులకు జీవనోపాధిని అందించడమే కాకుండా, జిన్నింగ్, ప్రెస్సింగ్ మరియు రవాణా వంటి అనుబంధ రంగాల పురోగతికి తోడ్పడుతుంది.
పత్తి పంటకు భాస్వరం ఎందుకు అవసరం?
బలమైన వేరు వ్యవస్థ మరియు సకాలంలో పంట ఎదుగుదల
భాస్వరం లోతైన వేరు వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది పత్తి మొక్కలు త్వరగా స్థిరపడటానికి, ప్రారంభ దశలో వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి మరియు నేలలోని పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది.
పూత, కాయ (బొల్లె) ఏర్పడటం మరియు నిలబడటం
ఇది మొక్కలలో శక్తి బదిలీకి (ATP) తోడ్పడుతుంది, ఇది పూత దశలో అత్యంత కీలకం. దీనివల్ల కాయలు బాగా పట్టుకోవడమే కాకుండా, పూత మరియు పిందె రాలడం తగ్గుతుంది, పంట అంతటా సమానంగా ఎదుగుతుంది.
దిగుబడి మరియు పీచు నాణ్యత పెంపు
తగినంత భాస్వరం లభించడం వల్ల కాయ పరిమాణం పెరిగి, విత్తనం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇది చివరికి దిగుబడిని పెంచడంతో పాటు పీచు యొక్క బలాన్ని, నాణ్యతను మెరుగుపరుస్తుంది.